


పార్వతీపురం పాతబస్టాండ్లో గల పురాతన శ్రీరాముని ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ తీసుకెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరికీ మంచి చేయాలని, ముఖ్యంగా నా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందర్నీ కాపాడాలని భగవంతున్ని వేడుకున్నారు. ప్రతీ ఒక్కరూ హిందూధర్మాన్ని కాపాడాలన్నారు. గత ప్రభుత్వం దేవాలయాలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. ఈ రామాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో మండలగణేష్,మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, కోలా మధు, కౌన్సిల్ సభ్యులు కోరాడ నారాయణరావు, రణబేరి చిన్నంనాయుడు, బడే గౌరునాయుడు, మంత్రిన రవికుమార్, డాక్టర్ భానుప్రసాద్, గణేష్, ఆనంత్, రాజశేఖర్, చిన్న, శంకర్రావు, జగదీష్, తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
