సన్న బియ్యం పంపిణీపేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు,చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి

Sesha Ratnam
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్7,(గరుడ న్యూస్ ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్,దోనూరు జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి అన్నారు.రాష్ట్రంలో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బీసీ వర్గాల ప్రజలు సన్న బియ్యంతో తినాలని రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన పేదల ప్రజల కోసం ఈసన్న బియ్యం పథకాన్ని తీసుకురావడం హర్షనీయమని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 6 గ్యారంటీలలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుతూ ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుపు రేషన్ కార్డులు ఉన్నటువంటి పేద ప్రజలకు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత కరెంటు,గ్యాస్ సబ్సిడీ నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం,ద్వారా వారికి చేయుత కల్పించడంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ భర్తీలను నింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నిదని అన్నారు.పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *