


తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): నిన్నటి రోజు అనగా 05-04-2025 మధ్యాహ్నం సమయంలో,చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వచ్చి వెళుతూ,పాకాల మండలంలోని టిడిపి నాయకులతో సమావేశం ఇవ్వడం జరిగింది,పాకాల మండలంలోని వైఎస్ఆర్సిపి జెండాలు కానీ,వైఎస్ఆర్సిపి కి సంబంధించిన ఓపెనింగ్ బోర్డ్స్ కానీ, ఎక్కడ కనిపించకూడదని వాటిని తొలగించాలని, మరియు తుడా బెంచెస్ కి పెయింటింగ్స్ వేయని ఎడల ఏమాత్రం పని చేయని వారిని, వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కానీ లీడర్లతో కానీ ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉండకూడదు అని చెప్పినట్టు సమాచారం, అలా చెప్పిన వెంటనే నిన్న మధ్యాహ్నం కొంతమంది మండల్ లీడర్లు, డైలీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి జెండాను,జెసిపి తో తొలగించి వాళ్ళ రాక్షసత్వాన్ని చాటుకున్నారు, వైయస్సార్సీపి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ వాళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నారు, ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్ని నిర్వహించిన వైఎస్ఆర్సిపి జెండాను అయితే వదలడం జరగదు అని వైఎస్ఆర్సిపి లీడర్లు కార్యకర్తలు చెబుతున్నారు, మునుపెన్నడూ లేని విధంగా భూ కబ్జాలు కాలవపరంబోకుల మీద షెడ్లు వేసుకోవడం అప్రూవల్ లేని ఫ్లాట్లు వేయడం అక్రమ మైనింగ్ మట్టి తవ్వకాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు వీటన్నిటినీ ప్రజలు చూస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు అసహనానికి గురవుతున్నారు . నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇవన్నీ తెలిసి కూడా చోద్యం చూస్తున్నారని నూరేళ్ల పెడుతున్నారు వీలైనంత తొందరగా వీటిపై పోలీసులు గాని న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి లీడర్లు కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో పాకాల మండల డివిజన్ కన్వీనర్ నంగా కపిలేశ్వర రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ మునీర్ భాష పాకాల టు పంచాయతీ కన్వీనర్ సుధాకర్, మండల బీసీ అధ్యక్షుడు మధుసూదన్, మురళీకృష్ణ, ఖాదర్, ఖాదర్ వలీ, కున్ని, బేటా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
