
గరుడ ప్రతినిధి పుంగనూరు
చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో స్వయంభు వెలిసి ఉండు శ్రీ బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రు5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రు.72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారం, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయానికి సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరూకి ఉప కమిషనర్ ఏకాంబరం కృతజ్ఞతలు తెలిపారు
