
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్8,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈనెల 12 తేదీన శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు జరిగే హనుమాన్ శోభయాత్ర కరపత్రాలను స్థానిక ఎస్సై జగన్,అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శంకరనంద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై జగన్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని శోభాయాత్ర నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కరపత్రాల దాతగా నిలిచిన పత్రికా విలేఖరి గంగాపురం సాయి గౌడ్,వీర హనుమాన్ భక్త బృందం,తదితరులు పాల్గొన్నారు.
