పుట్టపాక పద్మశాలి సంఘం తరుపున భువనగిరి ఎడి కి వినతి పత్రం అందజేత

Singham Krishna
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,పుట్టపాక,ఏప్రిల్08,(గరుడ న్యూస్ ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న పొదుపు పథకంలో భాగంగా త్రిప్టు ఫండ్ పథకం కొరకు 447 జియో ట్యాగ్ కలిగిన చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో 375 మందికి వెరిఫికేషన్ చేసి,కెనరా బ్యాంకు వారికి లిస్ట్ వచ్చినది.ఇతర కారణాల వలన 72 మంది జియో ట్యాగ్ కలిగిన చేనేత కళాకారులకు బ్యాంకు కు పంపించిన లిస్టులో పేరు రాలేదు.పెండింగ్లో ఉన్న 72 మంది జియో ట్యాగ్ కలిగిన చేనేత కళాకారులకు నేతన్న పొదుపు పథకంలో అర్హులు అయ్యే విధంగా చేయగలరని,నూతన జియో టాగ్ అవకాశాన్ని కల్పించగలరని కోరుతూ,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ చిక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు సామల భాస్కర్ తో కలిసి,పద్మశాలి సంఘం పుట్టపాక అధ్యక్షులు గజం హనుమంతు కార్యవర్గంతో కలిసి చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు యాదాద్రి భువనగిరి కి వినతిపత్రం ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం తిరందాసు దశరథ,ప్రధాన కార్యదర్శి గూడెల్లి బాలరాజు,కోశాధికారి ఐటిపాముల శంకర్,గజం రమేష్,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *