
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): విద్యార్థుల స్థాయికి తగ్గట్టు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినప్పుడే చెప్పిన పాఠం విద్యార్థులకు చేరుతుందని తిరుపతి జిల్లా పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు. ఆయన బుధవారం పెద్దెమ్మ గారిపల్లి,పులివర్తి వారిపల్లి పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల వారి స్థాయి తగ్గట్టు చదువు చెప్పినప్పుఫు వారికి ఆ చదువు వస్తుందని అన్నారు. అవసరమైన చోట ఉపాధ్యాయులు కింద కూర్చొని పాఠాలు చెప్పాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి తమ జీవిత కాలంలో ఒక ఉపాధ్యాయున్ని ఆదర్శంగా తీసుకుంటారని కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థుల రాసిన వర్క్ బుక్స్ లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయ చంద్ర రెడ్డి ,విద్యార్థులు పాల్గొన్నారు.

