
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 11,(గరుడ న్యూస్ ప్రతినిధి):
పద్మశాలి సంఘం పుట్టపాక ఆధ్వర్యంలో తేది.10/04/2025 న ఇచ్చిన వినతి పత్రం స్వీకరించి,నేతన్న పొదుపు పథకం లో భాగంగా అనుబంధ చేనేత కళాకారునికి 600 రూపాయలు బదులుగా 800 రూపాయలు పొదుపు చేసుకునేందుకు అవకాశం ఇచ్చి జీవో విడుదల చేసినందుకు,అతి త్వరలో చేనేత రుణ విముక్తి కల్పించబోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి,చేనేత,జౌళి శాఖ మంత్రివర్యుల తుమ్మల నాగేశ్వరరావు కి,ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి కి,మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి,అనునిత్యం మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి కి,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు కి,పద్మశ్రీ చింతకింది మల్లేశంలకు
యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల భాస్కర్,ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
