నిఘా నేత్రాలు( సిసి కెమెరాలు) వితరణ దాత నల్లి షణ్ముఖ ను సత్కరించిన జిల్లా ఎస్పీ

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
3 Min Read
ప్రజల భద్రతలో సిసి కెమెరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాపర్స్(బ్యారికేడర్స్) పాత్రను గుర్తించి వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ

ప్రస్తుతకాలంలో నేరములు అదుపుచేయడంలోను, నేరస్థులను కనిపెట్టడంలోను సిసి కెమెరాలు వినియోగం ఎంతో అవసరం ఉంది. దీనిలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమయిన కూడలిలో, విద్యాలయాలు,ప్రార్దనా మందిరాలు, జనసంచారంగల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చి ప్రజలకు మరింత రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో జిల్లాలో  దాతలు ఎవరైనా స్వచ్చందంగా ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహాయ సహకారాలను అందించాలని అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధి అంతట, ముఖ్యమయిన కూడలిలో , జనసంచారంగల ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చి ప్రజలకు మరింత రక్షణ కల్పించాలి అనే సంకల్పంతో పోలీస్ అధికారులు ప్రజలలో అవగాహనా కల్పించగా, పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట వాస్తవ్యులు నల్లి రాములు  మరియు నల్లి అప్పలనర్సమ్మ  జ్ఞాపకార్థం గా నల్లి సూర్యనారాయణ మరియు నల్లి పైడిరాజు  తన కుమారుడు అయిన నల్లి షణ్ముఖ  సుమారు ఒక Rs. 1,20,000,/-  ( లక్ష ఇరవై వేలు రూపాయలు విలువగల CC కెమెరాలు) మొత్తంగా  40 CC కెమెరాలను, DVR లను, వాటిని అమర్చుటకు కావలసినటువంటి పరికరాలను పాచిపెంట పోలీస్ స్టేషన్ కు, పాచిపెంట గ్రామము మరియు పాచిపెంట మండల పరిధిలో మరికొన్ని ఇతర గ్రామాల్లో అమర్చుటకు ముందుకు వచ్చి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ కు అందజేయడం జరిగింది.

సామాజిక స్పృహ తో నల్లి షణ్ముఖ  సిసి కెమెరాలను వితరణ చేయడంపై ఎస్పీ  ఆయన సేవా దృక్పధాన్ని తన గ్రామానికి చేస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం నల్లి షణ్ముఖ ను  దుస్సాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరింతమంది దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి  జిల్లా లో ప్రజలకు రక్షణ కల్పించే చర్యలలో భాగంగా, సిసి కెమెరాలు, బాడీ వార్న్ కేమారాస్, రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాపర్స్(బ్యారికేడర్స్) వంటివి అందించి పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ …. జన సముదాయం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, మరియు ముఖ్యమైన  ప్రాంతాల్లో సిసి  కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేర ప్రవృత్తి గల వారిపై నిఘా పెట్టవచ్చు, నేరాలను నియంత్రించవచ్చు, అలాగే నేరాలను ఛేదించుటకు, ప్రజల భద్రతకు, శాంతిభద్రత పరిరక్షణలోను  అలాగే నేరస్తులను పట్టుకోవడంలో CC కెమెరాలు చాలా ఉపయోగపడుతాయన్నారు.

ఇప్పటివరకు పార్వతిపురం జిల్లాలో 1226 CC కెమెరాలను అమర్చడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 2015 ప్రకారం వ్యాపార సముదాయాలు యాజమాన్యం వారు, అదేవిధంగా విద్యాలయాలు,ప్రార్దనా మందిరాలు, ఇతర సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేసారు..

నల్లి షణ్ముఖ  మాట్లాడుతూ ఈ విధంగా ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని, జిల్లా ప్రజలకు రక్షణ కల్పించే చర్యలో నా వంతు సహకారం పోలీస్ శాఖకు అందించానన్నారు. ఈ రీతిలో సత్కరించడం మా జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఏ ఎస్పి  అంకిత సురాన,ఐపిఎస్ , ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సిఐ రంగనాధం, డిసిఆర్బి సిఐ ఆదాం, సాలూరు టౌన్ సిఐ అప్పలనాయుడు,సాలూరు రూరల్ సీఐ రామక్రిష్ణ, ఏఆర్ ఆర్ఐ లు నాయుడు,రాంబాబు పాచిపెంట ఎస్సై  కె.వెంకట సురేష్  పాల్గొన్నారు.

నేరములు అదుపుచేయడంలోను, నేరస్థులను కనిపెట్టడంలోను, శాంతిభద్రతల పరిరక్షణలోను, సిసి కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి…..జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *