ముంబైలోని చైత్య భూమి వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చైత్య భూమి వద్ద బాబు సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ చంద్ర మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు గాంచిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సమాజానికి చేసిన సేవలు మరువరానివన్నారు. బడుగు, బలహీన, అనగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా అంబేద్కర్ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. భారత రాజ్యాంగంలో ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈయన దేశానికి చేసిన సేవను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

    Share This Article
    Leave a Comment

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *