సూర్ణపు మహేందర్ బాబు కి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వారసత్వ పురస్కారం – 2025.

Srinivas Nayak
2 Min Read

సూర్ణపు మహేందర్ బాబు కి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వారసత్వ పురస్కారం – 2025.
మహబూబాబాద్ వాసికి దక్కిన అరుదైన గౌరవం. అంబేద్కర్ ఆశయాలను సజీవంగా ఉంచుతున్న వారిని గుర్తించి ప్రతి సంవత్సరం ఈ పురస్కా రాన్ని అందజేస్తారు.
_14_04_25 సంవత్సరానికి గాను భారతీయ వైమాని క దళంలో సీనియర్ నాన్ కమిషన ర్ ఆఫీసర్ హోదాలో దేశానికి సేవలు అందిస్తున్న సూర్ణపు మహేంద్ర బాబుకు ఈ అవార్డు ప్రధాన చేయడం జరిగింది.

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16,( గరుడ న్యూస్).

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మడూరు కాలనీకి చెందిన సూర్నపు మహేందర్ బాబు కి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేజిసి అవార్డు, (డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసత్వ పురస్కారం) – 2025 దక్కింది.”త్రేతాయుగ్ ఫౌండేషన్” వారు గతకొన్ని సంవత్సరాలుగా దేశంలోని దళిత కులంలో పుట్టి దేశంలోని వివిధ రంగంలో అత్యున్నత స్థాయిలో సేవలందిస్తు, అంబేద్కర్ ఆశయాలను సజీవంగా ఉంచుతున్న వారిని గుర్తించి ప్రతి సంవత్సరం ఈ పురస్కారం అందజేస్తారు. 14.04.25 నాడు డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా, భారతీయ వైమానిక దళంలో సీనియర్ నాన్ కమిషనర్ ఆఫీసర్ హోదాలో దేశానికి సేవలందిస్తున్న సూర్ణపు మహేందర్ బాబు కి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది.మహేందర్ బాబు గారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మడూరులో సూర్ణపు ముత్తయ్య & సుగుణ దంపతుల ఏకైక పుత్రుడు మహేందర్ బాబు విద్యాభ్యాసం తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నర్సంపేట లో పదవ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. ఆ తరువాత విశాఖ పట్టణంలోని డిఫెన్స్ అకాడమీ లో శిక్షణ పొంది తన 18వ ఏట 2009వ సంవత్సరంలో భారతీయ వాయుసేనలో చేరారు. అప్పటినుండి నేటి వరకు 16 సంవత్సరాలుగా దేశానికి తన సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా మహేందర్ బాబు మాట్లాడుతూ, ఈ అవార్డ్ తీసుకోవడం ఆనందంగా ఉంది. డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ ఆశయాలను సజీవంగా ఉంచడమే అంబేద్కర్ కి నిజమైన నివాళి అని తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *