
రెండు వర్గాలుగా విడిపోయిన మానుకోట కాంగ్రెస్.
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ మానుకోటలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందులో పట్టణ కాంగ్రెస్ ఒక వర్గం కాగా, జిల్లా కాంగ్రెస్ ఒక వర్గంగా పోటాపోటీగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం అంజయ్య ఒక వర్గానికి అధ్యక్షత వహించగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గానికి అధ్యక్షత వహించారు. పది సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మానుకోట పట్టణంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని కాంగ్రెస్ పార్టీ అభిమానులను బాధిస్తుంది.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17,( గరుడ న్యూస్).
మహబూబాబాద్ పట్టణంలో ఈరోజు మదర్ తెరిసా విగ్రహం నందు కాంగ్రెస్ పట్టణ కమిటీ ఉదయం తొమ్మిది గంటల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మహిళలను కూడదీసి నిరసన కార్యక్రమా న్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురం అంజయ్య. ఇది ఇలా ఉంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నాయకత్వంలో కొంతమంది నినాదాలు చేస్తూ మదర్ తెరిసా విగ్రహం వద్దకు వచ్చారు. దీనితో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు, నెలకొన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ గా రెండు వర్గాలుగా విడిపోయి ధర్నాలు నిర్వహించడం చూసే ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కాంగ్రెస్ అధినాయకుల పేర్లను ఈడి కేసు పెట్టడాన్ని నిరసిస్తూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరోజు ధర్నా కార్యక్రమం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రికా ముఖంగా ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం నుండి మదర్ తెరిసా విగ్రహం వద్దకు రావడం మొదలుపెట్టారు. అందులో మహిళలు అధిక శాతంలో ఉండటం కనిపించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మొదలయ్యింది.
మదర్ తెరిసా విగ్రహం నాలుగు బాటల మధ్యన ఉండటం వలన కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు చుట్టూ వలయంగా ఏర్పడి నాలుగు వైపులా నుండి ఎలాంటి వాహనాలను రాకుండా సుమారు 45 నిమిషాల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నాయకత్వంలో కొంతమంది “గడి” నుండి ఊరేగింపుగా బయలుదేరి మదర్ తెరిసా విగ్రహం వద్దకు చేరుకున్నారు. పట్టణ కాంగ్రెస్ నాయకత్వంలో కట్టిన బ్యానర్ను సైతం తీసిపారేశారు. అసలు ఈ ధర్నా కార్యక్రమం లో ఏం జరుగుతుంది అన్న అయోమయ పరిస్థితిలు నెలకొన్నాయి. కొద్దిసేపు ఇరు వర్గాల వారు నినాదాలు చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం పార్టీని ఒక్క త్రాటిపై నడిపించే నడిపించడంలో విఫలమవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెవులు కురుకుంటున్నారు. జిల్లా పార్టీ కీ తెలపకుండా పట్టణ అధ్యక్షుడు మరునాడు ధర్నా కార్యక్రమం ఉన్నదని ప్రెస్ నోట్ ఎందుకు ఇచ్చాడు. జిల్లా పార్టీ ఇలాంటి వాటిని సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉండే పట్టణ అధ్యక్షుడు ఉదయం నుండి పట్టణంలోని పార్టీ కార్యకర్తలను సమీకరించడం జరిగింది. ఈ సమీకరణలో పార్టీలోని కొందరు పెద్దలు పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన ధర్నాకు వెళ్ళవద్దని ఫోన్లు చేసినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. ఏది ఏమైనా జిల్లాలో గుట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం వల్ల విభేదాలు ఉన్నాయని ప్రస్ఫుటంగా తెలియజేసినట్లు అయినదని సీనియర్ కార్యకర్తలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
“ఇంకా ఉంది”.
