
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,ఏప్రిల్18,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇదే పద్యంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని కూడగట్టుకొని వెంటిలేషన్ పై సర్కారును కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
