
కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారి మఠం, గరుడ న్యూస్ (ప్రతినిధి): A. ఓబుల్ రెడ్డి ఏప్రిల్ :17; కడప జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ కార్యవర్గాన్ని నియమిస్తూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆమోదించిన ఆదేశాలను, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్. డి. విజయ జ్యోతి గురువారము బ్రహ్మంగారిమఠం కు చెందిన ఎస్ అమర్నాథ్ రెడ్డికి డి సి సి సెక్రెటరీగా నియామక పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులందరూ పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్, అలీ ఖాన్, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం సమన్వయకర్తలు శివ మోహన్ రెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ వైస్ చైర్మన్, సయ్యద్ ఖాజ మైనుద్దీన్ , శ్యామలమ్మ, గౌరీ దేవి, స్టేట్ మైనార్టీ కార్యదర్శి, రఫీ కాన్, హరి ప్రసాద్, పి.డి. సంజయ్ కాంత్, షేక్ నీలం, సిద్ధిక్, ముబారక్ మొదలగువారు పాల్గొన్నారు.


