ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి లో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ గారు చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.లేప్రోసి టి బి మరియు HIV కేసుల గురించి ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు.టి బి వ్యాధిగ్రస్థులు ప్రతి రోజు 2 కోడిగుడ్లు, 2 గ్లాసులు పాలు మరియు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.స్పర్శ లేని తెల్లమచ్చలు ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉచితంగా పరీక్ష చేయిచుకోమన్నారు.కుష్ఠు వ్యాధిగ్రస్థులకు ఉచితంగా MCR మరియు అంగవైకల్యం ఉన్న వాళ్లకు శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు.గర్భిణీ స్త్రీలకు, టి బి కేసులకు HIV పరీక్ష తప్పనిసరిగా చేయమన్నారు.అన్ని ఇండికేటర్లు100 శాతం సాధించాలన్నారు.Cy టి బి మరియు సికిల్ సెల్ టెస్టులు త్వరతగతిన పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో Dr వెంకట ప్రసాద్ అదనపు జిల్లా వైద్యాధికారి.డాక్టర్ పవన్ కుమార్ PHC సిబ్బంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *