

ఎన్నో ఏళ్ల చిలకలపల్లి గ్రామ ప్రజల కల నెరవేర్చిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పార్వతీపురం నియోజవర్గం బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రకు మంగళవారం సాయంత్రం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ముందు ఆ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ కాలనీ ప్రజలు విద్యుత్ సమస్యలతో ఎంతోకాలంగా ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకునే నాధుడే కరువయ్యారని వారు మొర పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పిన హామీ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆ వీధిలో విద్యుత్ వైర్ల మార్పిడికి రూ.42.5లక్షలు మంజూరు చేయించడంతో వారంతా ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఎంతోకాలంగా వైర్లు మార్పిడి చేయనందున ప్రాణ నష్టం జరిగిందని, తమ దయవల్ల తామంతా ఊపిరి పీల్చుకున్నామని అక్కడ ప్రజలు, మహిళలు ఎమ్మెల్యేకు కలచాలనం చేసి, కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసి ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతి, అక్రమాలు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, ఈ విషయం ప్రజలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే సభాముఖంగా తెలియజేశారు.ఈకార్యక్రమంలో ట్రాన్స్ కో ఎస్ ఈ చలపతిరావు, డీ ఈ గోపాలరావు నాయుడు, ఏడీఏ రమణారావు, తెదేపా మండల అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంట్ తెదేపా బీ సీ సెల్ అధ్యక్షులు బీ. రామ్మోహనరావు, సంజీవరావు, మండల పెదపాపినాయుడు, సంబాన గౌరునాయుడు, తెదేపా క్లస్టర్ ఇంచార్జి లు రాంబాబు పాల్గొన్నారు.

