

విజయనగరం జిల్లా, నూతన జిల్లా జడ్జిగా భాద్యతలు స్వీకరించిన ఎం. బబిత ను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులోని తన చాంబర్లో జడ్జి ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధిత ప్రజలకు న్యాయం నిందితులకు శిక్షలు పడేలా ఇరు శాఖల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేద్దామని ఇరు శాఖల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా సమన్వయంతో ముందుకెళ్దామని జిల్లా జడ్జి, ఎస్పీలు ఆకాంక్షించారు.
