
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 26,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనార్టీ యువకులు నహీం షరీఫ్ కుమారుడు అసద్ షరీఫ్,ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 447 మార్కులు సాధించడం జరిగింది.అదేవిధంగా షేక్ ఉబెడ్,ఫారాన్ ఖురేషి,జమీర్ షేక్,విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో మసీదు కమిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ అక్బర్ అలీ,విద్యార్థులకు శారువాకప్పి సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు,విద్యార్థులు, తదితరులు,పాల్గొన్నారు.

