
గిరిజన ఉద్యోగుల పట్ల జాతి వివక్ష చూపుతున్న
మణికొండ రఘునందన్ రావు
ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ తెలంగాణ
ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్న
మణికొండ రఘునందన్ రావు
రాష్ట్రం వ్యవసాయ శాఖలో కోట్లు గడిస్తూ అనేకమంది ఉద్యోగుల గోసపుచ్చుకుంటున్న
మణికొండ రఘునందన్ రావు
ఇతనిపై సెంట్రల్ ఈ డి మరియు ఏసీబీలతో దాడులు నిర్వహించాలి
మణికొండ రఘునందన్ రావు అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి అతనిని సస్పెండ్ చేయాలి
లేనియెడల రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం
ఇతని అవినీతి అక్రమాలపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తున్న
బోడ రమేష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మహబూబాబాద్
తేజావత్ వాసు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ
తెలంగాణ స్టేట్ ప్రత్యేక ప్రతినిధి ఏప్రిల్ 26 (గరుడ న్యూస్)
ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో సెంటర్ వద్ద ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పని చేస్తున్న మణికొండ రఘునందన్ రావు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. డబ్బు దాహం అతని పేరులోనే ఉంది. అదేవిధంగా రఘునందన్ రావు అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయినందున గిరిజన లంబాడి ఉద్యోగుల పట్ల జాతి వివక్ష చూపుతున్నాడు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తన కులం రావు కావడంతో గత పది సంవత్సరాలు దాదాపుగా 10 శాఖలను ఒక్కడే మైంటైన్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించాడు. గతంలో అతను నిర్వహించిన శాఖలు పంచాయతీరాజ్ శాఖ, అగ్రికల్చర్ కమిషనర్, అగ్రికల్చర్ వైస్ ఛాన్స్లర్, మార్కెటింగ్ శాఖ, హార్టికల్చర్ శాఖ అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి పదవులు అనుభవించి కోట్లలో డబ్బులు గడించాడు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా కూడా వ్యవసాయ శాఖలో కావచ్చు ప్రభుత్వం పైన కూడా తన మార్కు చూపించుకుంటున్నాడు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రమోషన్ల పేరుతో కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతని అవినీతి, అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టి అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు గండి పెట్టడానికి వేరే శాఖకు బదిలీ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు. రఘునందన్ రావు పాల్పడ్డ అవినీతి అక్రమాల గురించి గతంలో అన్ని శాఖలను మైంటైన్ చేయడానికి రఘునందన్ రావు నియమించిన షాడో కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ? , అతని ద్వారా ఎన్ని కోట్లు అక్రమ డబ్బు సంపాదించాడు ? , కమీషనరేట్ కు సోకుల పేరుతో ఎన్ని కోట్లు సంపాదించాడు ? , బదలీల పేరుతో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించిన ఘనత రఘునందన్ రావు ది కాదా ? , కో-ఆపరేటివ్ సొసైటీలలో (పి ఏ సి ఎస్) వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేటు వ్యక్తులకు మూట చెప్పింది రఘునందన్ రావు కాదా ? ఇటువంటి రఘునందన్ రావు యొక్క అవినీతి, అక్రమాలను రాబోయే రోజులలో దశలవారీగా రఘునందన్ రావు లీలలను బయటపెడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, జిల్లా నాయకులు లాల్ సింగ్ నాయక్, చక్రవర్తి నాయక్, జైల్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
