శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు 2,50,000/- విలువ గల బోరు మోటారు, బోరు పైపులు, కేబులు, స్టాటర్ మొదలగునవి. అమ్మవారికి కానుకగా సమర్పించియున్నారు

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి  పుణ్యంక్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు. చిక్క కెంపన్న. ప్రకాష్, గజేంద్ర, మల్లికార్జున, రామగుండహళ్లి, అత్తూరు పోస్టు, యాలాహంక హోబ్లీ, బెంగళూరు వారు సుమారు రూ. 2,50,000/- విలువ గల బోరు మోటారు, బోరు పైపులు, కేబులు, స్టాటర్ మొదలగునవి శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించియున్నారు. కొండ క్రింద ఇదివరకే వున్న బోరు నందు వారి స్వంత ఖర్చుతో సదరు వస్తువులతో బిగించడము జరిగినది. దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం గారు వీరికి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కలుగజేసి తీర్థ ప్రసాదములు అందజేసి సత్కరించినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *