అధికారులు మారినా మారని నేమ్ బోర్డు

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు 

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అధికారుల పనితీరు నిమ్మకు నీరెత్తినట్లుంది.ఎన్నిసార్లు హెచ్చరించిననూ మారని వైనం .ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రభుత్వ ఉద్యోగులు తన విధినిర్వహణ లో జవాబుదారి తనం,పారదర్శకత ఉండాలని సమాచార హక్కు చట్టం 2005 తీసుకొని వచ్చింది.ఐతే ఆసుపత్రి ప్రాంగణం లో సమాచార హక్కు చట్టం బోర్డు ఉన్నా ఖాళీగా దర్శనం ఇస్తుంది.ఎవరికైనా ఆసుపత్రికి సంబందించిన వివరాలు కావాలంటే ఎలా? చెప్పంది.ఆసుపత్రికి సంబందించిన వివరాలు ఎవరిని అడగాలి? అని ప్రజలు అంటున్నారు.అంతే కాకుండా ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు.ఏదైనా వైద్య సహాయం కావాలంటే ఎవరిని సంప్రదించాలనే వివరాలు ఎక్కడ సేకరించాలి.అదే గనుక సమాచార హక్కు చట్టం బోర్డు ఉంటే ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని సహా చట్టం ద్వారా సేకరించుకుంటాడు.కావున వెంటనే సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *