తెలంగాణ, యాదాద్రి, సింగం కృష్ణ, భువనగిరి స్టాపర్, మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే1,(గరుడ న్యూస్): తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ,ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రముఖ సామాజికవేత్త సంఘసంస్కర్త హైందవ సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చి సామాజికవేత్తగా గుర్తింపు పొందిన బసవేశ్వర జయంతిని నిర్వహించడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో యువత బసవేశ్వరుని అతని జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని గుర్తించారు.ప్రపంచానికి శివుడే దేవుడని గుర్తించిన గొప్ప తత్వవేత్త లింగాయత్ సిద్ధాంతాన్ని రూపొందించిన కార్మికవేత్తని తెలియజేశారు.ఈ సందర్భంగా దివ్యాంగులకు కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది.మాతృదేవోభవ సంస్థ,ఐపీసీ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి ఉదయలక్ష్మి నేషనల్ కోఆర్డినేటర్ సెల్వరాజ్,సీనియర్ నాయకురాలు అంజలి నాయుడు,సంఘమిత్ర సంఘం నాయకులు శారద,అల్లాజీ మొదలైన వారు పాల్గొని నర్రి స్వామి ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ నర్రి స్వామి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సామాజికవేత్తగా కార్యక్రమాలు చేస్తున్నడు కాబట్టి బసవ జయంతి సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు అనిమల్లశ్రీరామ్,ముసం చంద్రశేఖర్,దువ్వ నవీన్,కురుమ గజేంద్ర,మహిళా ప్రధాన కార్యదర్శులు రజిని,అనేకమంది మహిళలు పాల్గొన్నారు.