
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే03,(గరుడ న్యూస్):
కాంగ్రెస్ పార్టీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణనా,జన గణన చేస్తామని నిర్ణయం తీసుకుందని నారాయణపురం మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జూడో యాత్ర చేసి ఈ దేశంలో 70ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా నిరుపేదలు రాజకీయంగా,ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడి ఉండడానికి కారణం తెలుసుకొని దేశంలో కులగణన చేస్తానని మాట ఇచ్చాడు.ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణనను చేసి,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.రాహుల్ గాంధీ ఆలోచనతోనే దేశ వ్యాప్తంగా కుల గణన అంశం చర్చకు వస్తుందని,దీని కోసం ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,కేంద్ర ప్రభుత్వానికి,ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

