
గరుడ ప్రతినిధి పుంగనూరు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 5 న సోమవారం పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హల్ నందు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.పలమనేరు రెవిన్యూ డివిజన్ పరిధి లో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించి పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుంది.పలమనేరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించి పలమనేరు మున్సిపల్ కార్యాలయం నందు ప్రత్యేకంగా పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
