
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే03,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం సెల్ఫోన్లను పోగొట్టుకున్న వ్యక్తులు నారాయణపురం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా వాటిని సి ఈ ఐ ఆర్ లో ట్రాకింగ్ చేసి మొత్తం 11 సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వ్యక్తులకు నారాయణపురం పోలీస్ స్టేషన్ ఎస్సై జగన్ ఆధ్వర్యంలో అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా సెల్ఫోన్లను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు తిరిగి తమ ఫోన్లను పొందినందుకు ఎస్సై జగన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది,తదితరులు, పాల్గొన్నారు.
