
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలోని పెద్దలకుంట్ల పంచాయతీ చిప్పిలి వారి పల్లి గ్రామంలో స్థానికుల కథా మేరకు దళితులు స్మశానం కబ్జాకు గురి అయింది సర్వే నంబర్ 848 – 3లో 0.66 సెంట్లు స్థలం తోటిమాన్యం ఉందని తెలిపారు అయితే.చిప్పిలి వెంకటరమణ అతని కుమారుడు రెడ్డప్ప మరియు చిప్పిలి చిన్నరెడ్డప్ప వారు. సుమారు 1966 నుండి ఇప్పటివరకు దళితులు సమాధులను సుమారు 30 దాకా ఉన్నవి అయితేకబ్జా చేశారు. వెంకటరమణ రెడ్డప్ప చిన్న రెడ్డప్ప సమాధులను ట్రాక్టర్ తో రెండో తేదీన రాత్రి సమయంలో సమాధులను దున్నేశాడు. ఈ విషయమై పాపన్న గంగులప్ప తిరువల్లప్ప. ఇది సమాధుల భూమి కదా నువ్వు ఎందుకు దున్నేస్తావని అడగగా ఈ భూమి మాది నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అడ్డం వస్తే ట్రాక్టర్లతోనే తొక్కించి చంపేస్తానని బెదిరించారు. ఆ స్థలంను కబ్జాదారుల నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు

