

తిరుపతి, గరుడ న్యూస్ ప్రతినిధి మే 4, 2025 : భారత్లో వేగంగా ఎదుగుతున్న ఎడ్టెక్ సంస్థలలో ఒకటైన *స్కిల్వేద* తన నూతన శాఖను పవిత్ర నగరం తిరుపతిలో ఈ రోజు ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి పలు ప్రముఖులు హాజరై సందేశాల రూపంలో తమ ఆశీస్సులు అందించారు. ప్రారంభ కార్యక్రమానికి శ్రీ పొకల అశోక్ కుమార్ మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తిరుపతి ఓ ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా ప్రతిభావంతుల నగరం. ఇలాంటి ప్రాంతాల్లో విద్యను ప్రజలకందించే ప్రయత్నం అభినందనీయం. స్కిల్వేద తరహా ప్లాట్ఫామ్స్ యువతకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయి.” అని అన్నారు.
ప్రముఖ గాయని శ్రీమతి ఉషా గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ
“సంగీతం లాగే విద్య కూడా మనల్ని మార్చే శక్తివంతమైన సాధనం. స్కిల్వేద నూతన విద్యా మార్గాలను అందిస్తూ, సమాజానికి ఉపయుక్తమైన మార్గాన్ని చూపుతోంది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం.” అని తెలిపారు.
స్కిల్వేద CTO శ్రీ సందీప్ అవుటపల్లి మాట్లాడుతూ
“టెక్నాలజీ ఇప్పుడు విలాసం కాదు, అవసరం. స్కిల్వేద ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థికి అవసరమైన డిజిటల్ వనరులు, ప్రాక్టికల్ స్కిల్స్, కారీర్ గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. తిరుపతి శాఖ ఆ దిశగా ఓ పెద్ద అడుగు.” అని అన్నారు. స్కిల్వేద COO శ్రీ దనుష్ కుమార్ మర్రపు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితం నెమ్మదిగా మారాలి అనేది మా ఆశయం. ఈ బ్రాంచ్ ప్రాంతీయ స్థాయిలో శిక్షణ, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుంది. అని తెలిపారు.
స్కిల్వేద డైరెక్టర్లు శ్రీ ప్రమీల్ అర్జున్ మరియు శ్రీ సందీప్ అవుటపల్లి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని అతిథులకు, తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వారు సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరోసారి గుర్తుచేశారు – అందరికీ ప్రామాణిక, నైపుణ్యాత్మక విద్యను అందించడమే. కార్యక్రమం అనంతరం శిక్షకులు, విద్యార్థులు మరియు సంఘం ప్రముఖులతో జరిగిన ఇంటరాక్షన్లో డిజిటల్ విద్య ప్రాధాన్యతపై చర్చలు కొనసాగాయి.
స్కిల్వేద – విద్యను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ఇప్పుడు తిరుపతిలో తన ఆకాంక్షను మరింత విస్తరించింది.



