నూతనంగా ప్రతిష్టించిన కంఠమహేశ్వర స్వామి నీ దర్శించుకున్న టి ఎస్ సి వి రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది నర్రి స్వామి

Sesha Ratnam
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే05,(గరుడ న్యూస్)

మునుగోడునియోజకవర్గంలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో గౌడ కుల పెద్దలు నూతనంగా విగ్రహ ప్రతిష్ట చేసిన కంట మహేశ్వర స్వామి దేవాలయానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి  అధ్యక్షుడు అతిథిగా విచ్చేసి సందర్శించి ఆశీస్సులు పొందడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజంలోని అన్ని జాతులలో దైవత్వాన్ని పెంపొందించడం కోసం ఆ పరమశివుడే అన్ని అవతారాల్లో అవతరించారు ఆ శివుని దర్శించుకోవడం చాలా సంతోషకరం కురుమలకు బీరప్పగా గొల్లలకు మల్లన్నగా గౌడలకు కంఠమహేశ్వరంగా విశ్వబ్రాహ్మణులకు వీరబ్రహ్మేంద్రస్వామిగా ఈ విధంగా ప్రతి కులంలో ఆ శివుడు వివిధ రూపాలలో వచ్చి హిందువుల్లో దైవత్వాన్ని పెంపొందించాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోదరాభావంతో ఐక్యమత్యంతో హిందూ సమాజాన్ని చైతన్య చేయడానికి కృషి చేయాలని తెలియజేశారు.ఈ సందర్భంగా నర్రి స్వామి,ని కమిటీ వాళ్ళు సన్మానించారు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసిన కమిటీ సభ్యులను స్వామి,హృదయపూర్వకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు అనిమల్ల శ్రీరామ్,నక్క రాజు,సింగం కృష్ణ,దువ్వ నవీన్,ఉప్పలపల్లి బాలకృష్ణ,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *