సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నూతన బూత్ కమిటీల ఎన్నిక

Ashok kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే05,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపూర్ బీజేపీ మండల కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ ఆదేశాల మేరకు మండల  ప్రధాన కార్యదర్శి బండమీది కిరణ్ ఆధ్వర్యంలో నూతన బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 102 వ బూత్ అధ్యక్షులుగా అచ్చిని రవికుమార్,103వ బూత్ అధ్యక్షులుగా పాలకుర్ల శ్రీనివాస్ గౌడ్,107వ బూత్ అధ్యక్షులుగా అంతటి శ్రీనివాస్ గౌడ్,104వ బూత్ అధ్యక్షులుగా పాలకూర్ల లింగస్వామి గౌడ్,ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నుకోబడిన బూత్ అధ్యక్షులను బీజేపీ నాయకులు శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నకోబడిన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ మా బూత్ లలో భారతీయ జనతా పార్టీని క్షేత్ర  స్థాయిలో బలోపేతం చేసి,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు వంగరి రఘు,మండల ప్రధాన కార్యదర్శి బండమీది కిరణ్,గొల్లూరు యాదగిరి సాగర్,వీరమళ్ళ జంగయ్య గౌడ్,గూడూరు మంజునాథ్ రెడ్డి,ఏలే నర్సింహా,సికిలంమెట్ల వెంకటేష్,చిలివేరు సాయిబాబా,అచ్చిని ప్రవీణ్,జెటబోయిన గంగరాజు,సంగిశెట్టి నరేష్,సింగం భాస్కర్,ఇటుకల అనిల్,తదితరులు, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *