రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే06,(గరుడ న్యూస్)
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారముతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.సీఎంఆర్ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తూ తమ అవసరాలను ఆరోగ్య సమస్యలను తీర్చే విధంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు.పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.కొవ్వూరి అశోక్ రూ. 60,000,చిలువేరు బిక్షపతి కి రూ.42,000,ఎడ్ల రాములకు రూ.60000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ప్రజా పాలనలో ప్రభుత్వ పథకాలు పేదలకు అందించే దిశగా ప్రభుత్వము పనిచేస్తుందని ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు శ్రీ మందుగుల బాలకృష్ణ మాట్లాడుతూ చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎండి నయుం షరీఫ్,సీనియర్ నాయకులు రాసమల్ల యాదయ్య,పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు,అందే యాదయ్య,మాజీ వార్డు సభ్యులు ఉప్పరగొని యాదయ్య,ఎండి ముస్తఫా ఖాన్,గునిగంటి రాజు గౌడ్,అంతటి స్వామి గౌడ్,రిపోర్టర్ సింగం కృష్ణ,రాసమల్ల గాలయ్య,తదితరులు,పాల్గొని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.