గరుడ న్యూస్, సాలూరు
సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం శివాలయం రోడ్డులో ఉన్న విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో ఇటీవల విడుదలైన 10వ తరగతి, ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. తదుపరి విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు, అతిరథ మహారధులు, మీడియా మిత్రులు,తల్లిదండ్రులు బంధువులు హాజరయ్యారు. ప్రతిభ పరిమళించిన వేళ