గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు కొత్త యిండ్లు ఎన్.జి.ఓ కాలనీ రాజు క్షత్రియ సేవ సంఘం కార్యాలయం నందు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్బంగా క్షత్రియు లు అందరు కలసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా క్షత్రియ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తవత్సల రాజు మాట్లాడుతూ విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా,మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని, స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆశయ సాధన కోసం ప్రజల కోసమే పనిచేయాలని అల్లూరి సీతారామరాజు కొందరు సమరయోధులకు నిజమైన ఘన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం సభ్యులు రెడ్డెప్ప రాజు, కె.సుబ్రహ్మణ్యం రాజు,చిన బాబు,కె.లక్ష్మణ్ రాజు, భాస్కర్ రాజు,సతీష్ కుమార్ రాజు,జ్యోతి రాజు,జగదీశ్ రాజు,ఎన్. మంజు రాజు, సుదర్శన్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, నారాయణ రాజు, క్షత్రియ సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.