రోడ్డు ప్రమాదం ముగ్గురికి గాయాలుప్రమాదం..

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం సోమల తిరుపతి మార్గంలోని సినిమా సర్కిల్ వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రో ల్ బంక్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందర భాగం నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న భాకరాపేట సమీపంలోని గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108 ద్వారా సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా ప్రమాదంలో విద్యుత్ స్తంభానికి ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ కొంత దూరంలో ఎగిసిపడింది. అందుకు అమర్చిన బండరాళ్లు 30 మీటర్ల దూరంలో పడ్డాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *