
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో లద్దిగం పరధిలో ఉన్న సచివాలయాల్లో డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో 30 మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి, హై రిస్క్ కేసులను గుర్తించి తగు సూచనలను మందులు ఇవ్వడం జరిగింది.హై రిస్క్ కేసులు అనగా ముందు సిసేరియన్ అయ్యినవాళ్ళు,ప్ర స్తుత గర్భం లో మధుమేహం, బి పి, థైరాయిడ్, తీవ్ర రక్త హీనత, ముందు అబొర్షన్ అయిన వాళ్ళు మొదలగు కేసులు.ముందుగా వీటిని గుర్తుంచి మాత శిశు మరణాలు, అనారోగ్యాలు తగ్గించుట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.పౌష్టికాహారం తో రక్తహీనత దూరం.
హై రిస్క్ కేసులు 20 శాతం వరకు ఉంటాయాని తెలిపారు.
కార్యక్రమం లో పాల్గొన్నవారు డాక్టర్ పవన్ కుమార్,PHN జయలక్ష్మి,సూపర్ వైసర్ రెడ్డెమ్మ,ANM లు మరియు ఆశాలు. పాల్గొన్నారు
