కన్నుల పండుగలా సాగిన రథోత్సవం వేడుక

Sesha Ratnam
1 Min Read
మాడ వీధుల్లో కదిలి వస్తున్న బ్రహ్మరథం
అశేష జన వాహిని మధ్య బ్రహ్మ రథోత్సవం

మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారిమఠం : మే 8 (గరుడ న్యూస్): ప్రతినిధి ఏ. ఓబుల్ రెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం లోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 332 ఆరాధన గురు పూజ మహోత్స వాల్లో భాగంగా 5వ రోజు గురువారం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ విగ్రహాలతో మఠం మాడవీధుల గుండా అశేష జన వాహిని మధ్య బ్రహ్మ రథోత్సవం వేడుకలు కన్నుల పండుగలా వైభవంగా జరిగాయి. మఠం పిట్ పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్య చారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలువురు సి.ఐ. లు స్థానిక ఎస్సై, సిబ్బంది పర్యవేక్ష ణలో ప్రశాంతంగా నిర్వహించారు.
మఠం మాడ విధుల గుండా సాగిన రథోత్సవ వేడుకలు వీరబ్రహ్మ నామ స్మరణలతో మార్మోగిపోయింది. 5 రోజులపాటు జరిగిన ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మఠం సిబ్బంది పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. బ్రహ్మ రధాన్ని శ్రీ ఈశ్వరిదేవి మహాదేవి  మఠాధిపతులు శ్రీవీర శివకుమార్ బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వపు మఠాధిపతులు శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు, శ్రీ వెంకటాద్రిస్వామి, వీరభద్రయ్యస్వామి వీరంబట్లయ్య  స్వామి, దత్తాత్రేయ స్వాములు బ్రహ్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బద్వేలు ఆర్డీవో, చంద్రమోహన్, సీఐ లు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మంగారిని దర్శించుకుని తరించారు.
TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *