సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి..యన్.హెచ్.ఆర్.సి.

Sesha Ratnam
3 Min Read
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి గరుడ న్యూస్ (ప్రతినిధి):  పట్టణ సమీపంలో గల  రాజీవ్ నగర్ కాలనీలో చర్చి నిర్మాణం కోసం స్థలమును కేటాయించడం జరిగినది. గత కొంత కాలంగా ఈ స్థలము కోసం స్థానికంగా ఉండే క్రైస్తవులు, శ్రీకాళహస్తి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అను సంస్థ వారు ఇరు వర్గాలై స్థలం మాకంటే మాకు అంటూ వర్గ పోరు మొదలైంది. ఈ వివాదం కాస్త (యన్.హెచ్.ఆర్.సి.) జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ  వద్దకు చేరడంతో (యన్.హెచ్.ఆర్.సి.) జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ  ఏ.పీ. ఇన్చార్జ్ యం. రవీంద్ర  తెలిపిన వివరాల మేరకు.. రాజీవ్ నగర్ కాలనీలో చర్చి నిర్మాణం కోసం సర్వే నెం. 368 ప్రభుత్వం వారు చర్చి నిర్మాణానికి స్థలమును  కేటాయించిన స్థలాన్ని స్థానికంగా ఉండే క్రైస్తవులు చర్చి నిర్మించుకోవాలని  ఆలోచనలో ఉండగా  శ్రీకాళహస్తి టౌన్ లో వున్నటువంటి శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అను సంస్థ వారు సొంత చర్చిలను నిర్వహించుకుంటున్న వారు అందరూ కలసి రాజీవ్ నగర్ లో ఉన్న స్థలముకు వారి అసోసియేషన్కు ద్వారా కైవశం చేసుకోవాలని చూస్తుండగా రాజీవ్ నగర్ కాలనీలో స్థానికంగా ఉండే క్రైస్తవులు, అందుకు సమ్మతించక పోవడంతో ఇది ఇరువర్గాలకు  సమస్యగా మారింది. కొన్ని సంవత్సరాల నుంచి కాలనీవాసులు, పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్లు ఘర్షణ పడుతూ ఒకరిపై ఒకరు విభేధాలు పెంచుకుని పోలీసు కేసులు పెట్టుకునే దాకా వచ్చింది. వీరి విభేధాలని పరిగణించిన ప్రభుత్వాధికారులు చర్చి స్థలాన్ని  తాత్కాలికంగా నిషేదంలో ఉంచారు. ఇది ఇలా ఉండగా శ్రీకాళహస్తి పాస్టర్ అసోసియేషన్ వారు కాలనీలో స్థానికంగా ఉండే క్రైస్తవులకు తెలియకుండా ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిరిగి కరెంటు మీటర్ కి అప్లై చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుండగా ప్రభుత్వాధికారులు స్థానిక క్రైస్తవులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారికి పొజిషన్స్ ఇవ్వడం జరిగినది.  ఈ సమస్యను స్థానిక క్రైస్తవులు తమకు న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ (యన్.హెచ్.ఆర్.సి.) ఏ.పీ. ఇన్చార్జ్ రవీంద్రను సంప్రదించి  న్యాయ సహయము కోరగా ఆయన వెంటనే స్పందించి శ్రీకాళహస్తి ఎమ్మార్వోని సంప్రదించి చర్చి స్థలానికి సంబందించి ఎవరికన్నా పొజిషన్ ఇచివున్నారని సమాచారం కొరడంతో తమ వద్దకు పాస్టర్ల సంఘం వారు తరచూవస్తూన్నారని వారికి పొజిషన్ ఇవ్వడం జరిగిందని తెలుపడంతో జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ (యన్.హెచ్.ఆర్.సి.) ఏ.పీ. ఇన్చార్జ్ రవీంద్ర ఇరువర్గాల తగాదాలు సమాధానపడే వరకు హోల్డ్ లో ఉంచగలరని కోరడం జరిగింనది.  శ్రీకాళహస్తి పాస్టర్ అసోసియేషన్ వారు అప్పటికే కరెంటు మీటర్ కి అప్లై చేసుకుని ఉండగా (యన్.హెచ్.ఆర్.సి.) ఏ.పీ. ఇన్చార్జ్ రవీంద్ర విధ్యుత్ శాఖ ఏఈని సంప్రదించి ఈస్థలం ఇరువార్గాల మధ్య విభేధాలలో ఉంది కరెంటు మీటర్ ఇస్తే ఇరువర్గాలు మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది వారు సమాధానపడే వరకు కరెంటు మీటరు నిషేధించగలరని శ్రీకాళహస్తి ఎస్పీడీసీఎల్ ఏఈకి స్థానికుల సంతకాలతో కూడిన అర్జీని, నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఒక లెటర్ ను ఇచ్చి కరెంటు మీటరుని నిలుపుదల చేయడడం జరిగినది. విషయమై రాజీవ్ నగర్ క్రైస్తవులు  కూడా ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి పిర్యాదు చేసినట్టుగా సమాచారము అందించారు. జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ పట్టణంలోని శ్రీకాళహస్తి వెల్ఫేర్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని విచారించగ పాస్టర్ అసోసియేషన్ వారు ఇద్దరి మధ్య విభేదాలు వాస్తవమేనని ఒప్పుకుని తమ వద్ద పొజిషన్ సర్టిఫికెట్ ఉందని (యన్.హెచ్.ఆర్.సి.) తమకు తగిన న్యాయం చేయాలని శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున విన్నవించుకోవడం జరిగింది. ఇరువురి వినతులను స్వీకరించిన (యన్.హెచ్.ఆర్.సి.) నేషనల్ హ్యూమనెట్ కౌన్సిల్ ఏపీ ఇన్చార్జ్ యం. రవీంద్ర స్థలం విషయమై ఇరువర్గాల వారు తరచూ గొడవ పడకూడదని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సమాధానపరచి ఈ స్థల విషయమై (యన్.హెచ్.ఆర్.సి.) కి సరైన విషయ పరిజ్ఞానం లేకుండా కొంతమది ముస్లిం సోదరులు తాము కూడా హ్యూమన్ రైట్స్ వారమని ఫోన్ కాల్స్ ద్వారా హెచ్చరికలు కూడా వస్తున్నాయన్నరు. చర్చి స్థలంపై సమగ్రవిచారణ జరిపి తగిన ఆధారాలను సేకరించి సంబందిత అధికారులతో చర్చలు జరిపి న్యాయం చేకూరేలా తమ వంతు కృషిచేస్తామని (యన్.హెచ్.ఆర్.సి.) నేషనల్ హ్యూమనెట్ కౌన్సిల్ ఏపీ ఇన్చార్జ్ యం. రవీంద్ర వారికి తెలుపడం జరిగినది.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *