
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే10,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం కొత్తపేట పాత ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల కాలనీవాసులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడానికి ఆర్వో వాటర్ ఫిల్టర్,మరియు బోర్,పైపులను సుమారు 6,40,000 ఆరు లక్షల నలభై వేల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధుల తో నూతనంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు గౌరవనీయులు మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
