
గరుడ న్యూస్ పాచిపెంట
గ్రామంలో రైతులందరూ తమకున్న విస్తీర్ణంలో కనీసం 10% ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలని సర్పంచ్ యుగంధర్ పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలను భూసారం పెంపొందించాలంటే నవధాన్యాల ఉపయోగించాలని వివరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి తోడ్పాటునైనా అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలంటే ప్రజా ప్రతినిధుల తోడ్పాటు చాలా అవసరమని రాబోయే రోజులలో గ్రామాలలో ప్రొజెక్టర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయానికి అవగాహన కల్పిస్తామని మన మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసి విజయవంతమైన రైతుల విజయ గాథలను చూపిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి మొదటి మెట్టు నవధాన్యాలని రైతులందరూ తప్పనిసరిగా పంటకు ముందు నవధాన్యాలను సాగు చేసి భూమిలో కలియదున్నాలని కోరారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నవధాన్యాల ప్రాశస్యాన్ని వివరించారు. ఉపాధి హామీ శ్రామికుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయానికి తోడ్పాటు అందించాలని పెరటి కూరగాయలు పెంచుకోవాలని ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రకృతి వ్యవసాయం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదుబిల్లి శ్రీను ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య సిబ్బంది గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.
పాంచాలి లో ఇంటింటా ప్రకృతి వ్యవసాయ విస్తరణ ప్రణాళిక: వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు
గరుడ న్యూస్ పాచిపెంట
గ్రామంలో రైతులందరూ తమకున్న విస్తీర్ణంలో కనీసం 10% ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలని సర్పంచ్ యుగంధర్ పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలను భూసారం పెంపొందించాలంటే నవధాన్యాల ఉపయోగించాలని వివరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి తోడ్పాటునైనా అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలంటే ప్రజా ప్రతినిధుల తోడ్పాటు చాలా అవసరమని

