
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలం పాలెం పంచాయతీల స్థానికుల సమాచారం మేరకు..ఆదివారం వేకుజామున పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో అపార నష్టం వాటిల్లినట్లు పలు రైతులు వాపోయారు. కోటపల్లి లోని రైతులు వీరభద్ర నాయుడు, దామోదర్ నాయుడు, తదితరుల రైతుల మామిడి చెట్లను ఏనుగుల గుంపు కొమ్మలు విరిచేసి కాయలను నేలమట్టం చేశాయి. తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుకుంటున్నారు.
