
గరుడ ప్రతినిధి పుంగనూరు
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక ( గ్రీవెన్స్ డే ) జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు
