
గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేసి HM మరియు వార్డెన్ ల అవినీతిని అరికట్టాలి
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి మే 12 (గరుడ న్యూస్)
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎంలు మరియు వార్డెన్ ల డిప్యూటేషన్ లు రద్దుచేసి వారి అవినీతిని అరికట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల యుగంధర్ సోమవారం రోజు ఒక ప్రకటనలో విడుదల చేశారు ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం మరియు వార్డెన్ ల అవినీతిపై విచారణ చేపట్టాలని వారు కోరారు కొంతమంది హెచ్ఎంలు వార్డెన్లు మహబూబాబాద్ లోని బాలికల హాస్టల్ పత్తిపాక హాస్టల్ కురవి హాస్టల్ కి పరిమితమయ్యారని వారన్నారు వాస్తవానికి వారి పోస్టు వేరే పాఠశాలలో ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాల నుండి అధికారులకు లంచాలు ఇస్తూ మానుకోటలోనే పరిమితమైపోయారని వారు ఆవేదన వ్యక్తం చెందారు వార్డెన్ మరియు హెచ్ఎంలుగా కొన్ని ఏళ్ల నుండి ఈ పాఠశాలలో పనిచేస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై అధికారులు విచారించి వారి యొక్క డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని వారన్నారు జిల్లాలో ఏ అధికారి వచ్చిన వారికి ముడుపులు ముట్టజెప్పి ఈ ప్రాంతంకి పరిమితమైన వార్డెన్ హెచ్ ఎం లను వారికి కేటాయించిన పాఠశాలలో పనిచేయాలని ఆ రకంగా అధికారులు చొరువ చూపాలని వారన్నారు ఇన్ని సంవత్సరాల నుండి ఈ పాఠశాలలకు కొత్త వార్డులను కొత్త హెచ్ఎం లను రానీయకుండా అక్రమంగా డిప్యూటీషలను ఏర్పాటు చేసుకొని ధనార్జన దేంగా విద్యార్థుల సొమ్ము కాజేస్తున్నారని వారు అన్నారు అధికారులు కూడా ఒక్క నెలలోనే పై అధికారులకు సంబంధం లేకుండా ఆర్డర్స్ తీస్తున్నారని వారు అన్నారు పై అధికారికి ముడుపులు అప్పజెప్పితే ఎంతటి పనైనా చాలా సులభంగా అవుతుంది అని వారు అన్నారు ఇటీవల కాలంలో ముడుపులు అప్పజెప్పిన వారికి వెంటనే ఆర్డర్స్ వస్తున్నాయని ఇంత ఘోరమైన అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇట్టి విషయంపై ఎటునాగారం పిఓ భద్రాచలం పిఓ లు స్పందించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు మహబూబాబాద్ జిల్లా పరిధిలో శాశ్వత ఏ టి డి ఓ మరియు డి డి లేనందున ఆశ్రమ పాఠశాలలో జరిగే అటువంటి అవినీతిని అరికట్టే నాధుడు లేరని వారు అన్నారు శాశ్వతంగా పరిమితి అయిన హెచ్ఎం లు మరియు వార్డెన్ ల పై వారి అక్రమ సంపాదనపై విచారణ చేపట్టాలని వారు కోరారు.
