
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు మున్సిపాలిటీ వారు
శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ దృష్ట్యా
కమిషనర్ డీ.టీ.వి కృష్ణారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుధ్య పనుల నిర్వహణ పై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పట్టణ ప్రధాన రహదారులైన ఆర్టీసీ కాంప్లెక్స్, జైపూర్ రోడ్, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్ దండిగాం రోడ్, డబ్బివీధి, పెదకోమటీ పేట రోడ్, కోటవీధి,
సర్కిల్ ఆఫీస్ రోడ్ నుండి శివాజీ సెంటర్, శ్యామలాంబ గుడి రోడ్డు, నాయుడు వీధి మెయిన్ రోడ్డు, గాంధీనగర్ వరకు మాస్ స్వీపింగ్ గ్యాంగ్ వర్క్ తో రోడ్లు శుభ్రంగా తుడిపించడమైనది.
ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో జే.సి.బి సహాయంతో మట్టి దిబ్బను తొలగించి ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలించడమైనది.
శివాజీ సెంటర్ నుండి నాయుడు వీధి రోడ్ లో రోడ్డుపై పేరుకుపోయిన మట్టి దిబ్బలను తవ్వించారు.
పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ డీ.టీ.వి.కృష్ణారావు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ , శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

