మునుగోడు 60-70 సంవత్సరాలు గా చాలా వెనుకబడి ఉంది.కరెంట్ విషయంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి.రాబోయే 3,4 సంవత్సరాలలో కరెంటు సమస్యలు లేకుండా చేయాలి.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Ashok kumar
2 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,మే13,(గరుడ న్యూస్):

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు విద్యుత్ పనుల అభివృద్ధి పై మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో కలిసి  హైదరాబాదులోని టీజీ ఎస్పీడీసీఎల్  రాష్ట్ర కార్యాలయంలో సిఎండి ముషారఫ్ గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.ఈ సమీక్ష సమావేశంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో వోల్టేజి సమస్య,అదనపు ట్రాన్స్ఫార్మర్ల  కేటాయింపు,అదనపు సబ్ స్టేషన్ ల నిర్మాణం,లూజు లైన్ల సమస్యలు,గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగింపు సమస్యలతోపాటు  మరికొన్ని సమస్యలను సీఎండి ముషారఫ్,యాదాద్రి నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్య నాయకులు  చెప్పిన సమస్యలను సావధానంగా విన్న సిఎండి ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు.నాణ్యమైన,భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని.ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండి మొదలుపెట్టాలని,మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సిఎండి ముషారఫ్,ని కోరారు.మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉన్న కరెంటు సమస్యలు పరిష్కరించడానికి 34 కోట్ల రూపాయల అవసరమవుతున్నాయని,ప్రత్యేక దృష్టితో 34 కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్,కి వినతి పత్రం అందజేశారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు నా దృష్టికి వచ్చాయని దీనివల్ల ప్రజాప్రతినిధులుగా మాకు,ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.దయచేసి ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండి ముషారఫ్,ని కోరారు.మునుగోడు పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని,వ్యవసాయ పొలాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ వెంటనే  మార్పిస్తామని,ట్రాన్స్ఫార్మర్ల ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు సిఎండి ముషారఫ్.అగ్రికల్చర్ డిపిఆర్లకు ఏబి స్విచ్లు మొత్తం పెంచుతామని,మే నుండి జూన్ మధ్యలో  ఏబీ స్విచ్లు మొత్తం రిపేర్ చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన సిఎండి ముషారఫ్,కి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.ఈ సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు,నియోజకవర్గ ముఖ్య నాయకులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *