
గరుడ ప్రతినిధి చౌడేపల్లి మండలం
చౌడేపల్లి మే 13
చౌడేపల్లి పరిధిలోని దొరబాబు తోట సమీపాన ఉన్న పురాతన కోనేరు పునరుద్ధరణ పనులకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పురాతన ఆలయాలు కోనేరులను కాపాడటం మన బాధ్యతగా స్వీకరించాలని ఇలాంటి పురాతన కట్టడాలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా కోనేరు పునరుద్ధరణ జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీల మాధురి ఉపాధి హామీ పథకం ఏపీఓ చిన్న రెడ్డమ్మ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పూల చంద్రమౌళి బాలిరెడ్డి కుమార్ రెడ్డి పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు
