
గరుడ న్యూస్ సాలూరు(సంతోష్ కుమార్ శర్మ పాణి గ్రాహీ)
మే 13 మంగళవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాలూరు జైపూర్ రోడ్ లో కె.వి.ఆర్ రియల్ ఎస్టేట్స్ ప్రాంగణంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఐటిఐ అర్హత ఉన్నవారు,ఫ్రెషర్స్, అనుభవం ఉన్నవారికి గొప్ప అవకాశం ప్రధానంగా మెషిన్ ఆపరేటర్ గా కొవ్వూరు బొబ్బిలి గ్రోత్ సెంటర్లలో ఉద్యోగ అవకాసం పాటిల్ గ్రూప్ వారు కల్పిస్తున్నారు. ఈ జాబ్ మేళా, అప్రెంటిస్ మేళా కి 216 మంది విద్యార్థులు హాజరయ్యారు 30 మంది అప్రెంటీస్ ట్రైనింగ్ కి 50 మంది అన్ రోల్ పర్మినెంట్ జాబ్ కి ఎన్నికయ్యారు. ఇటువంటి అద్భుత అవకాశం మన సాలూరు టౌన్ లో తొలిసారిగా జరిగింది. ఎంపికైన విద్యార్థులకు 15 వేల జీతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాటిల్ గ్రూప్ హెచ్ ఆర్ మేనేజర్ ధరం పరశురాం, అసిస్టెంట్ మేనేజర్ కోరమండల్ పాటిల్ గ్రూప్ ఎం స్టాలిన్, బొబ్బిలి కి సంబంధించి పాటిల్ గ్రూప్ ప్లాంట్ హెడ్ మేనేజర్ పాటిల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మృణాల్ కుమార్ మిశ్రా, కళాశాల ప్లేస్మెంట్ , ట్రైనింగ్ ఆఫీసర్ కె. శ్రీనివాసరావు ప్రిన్సిపల్ బి.రవికుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. హాజరు కానివారు బుధవారం ఉదయం గ్రోత్ సెంటర్ కు
డైరెక్ట్ గా హాజరు అవ్వాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 9573644439 నెంబరు కు ఫోన్ ద్వారా సంప్రదించగలరు.

