
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,మే14,,(గరుడ న్యూస్):
హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల సురక్ష సమితి ఆధ్వర్యంలో జరిగిన అంబలి పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని న్యాయవాదులకు కక్షిదారులకు ఎంప్లాయిస్ అందరికీ ఉచిత అంబలిని పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రాక్టీస్ చేస్తూనే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న హైకోర్టు నరేష్ స్వామిని తెలంగాణ న్యాయవాద సురక్ష సమితి అధ్యక్షుడు అశోక్ ప్రధాన కార్యదర్శి హమ్మద్ కార్యవర్గ సభ్యులు సన్మానించడం జరిగింది.సందర్భంగా నర్రి స్వామి మాట్లాడుతూ న్యాయవాదులకు సంబంధించిన ఎన్నికలలో సామాజిక స్పృహ ఉండి సేవాదృపదమున్న వారిని ఎన్నుకోవాలని తెలియజేశారు తెలంగాణ న్యాయవాద సురక్ష సమితి వాళ్ళు చేస్తున్న ఈ ఉచిత అంబలి కార్యక్రమం చాలా హర్షించదగిన సేవా కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తిరుపతి వర్మ,వంశీకృష్ణ, మహేష్ బాబు,అనేకమంది జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
