
ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మున్సిపల్ అధికారులతో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటికి వెంటనే నోటీసులు అందించి తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే త్వరలో జరగబోయే శ్రీ ఎర్రకంచమ్మ, శ్రీ ఇప్పలపాలమ్మ అమ్మవార్ల పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని, కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించి మురుగునీరు బయటకు పోయే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఈ, టి పి ఓ, సానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.



