తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి గరుడ న్యూస్ (ప్రతినిధి):శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలోని చర్చిస్థలంపై స్థానికులకు, శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషయన్ పాస్టర్ల మద్య వివాదం మొదలై అది కాస్త ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. వివరాలలోకి వెళితే ఈ నెల 9వ తేదీన శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషయన్ పాస్టర్స్ సబ్యులు జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ ఏపీ ఇన్చార్జ్ ఎం రవీంద్రని కలసి మాకు శ్రీకాళహస్తి MRO శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషయన్ కు పొజిషన్ సర్టిఫికెట్ మేము ఎప్పుడో పొందాము కానీ రాజీవ్ నగర్ లో ఉండే స్తానీకులు చర్చి స్తలము విషయంలో మాకు అడ్డువస్తున్నారని మా డాక్యుమెంట్ పరిశీలించి మాకు న్యాయం చేయగలరని అర్జీ ఇవ్వడం జరిగినది. అర్జీ ఇచ్చిన శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషయన్ బాడి సబ్యులే ఈనెల 15వ తేదీన శ్రీకాళహస్తి 2, వ పట్టణ పోలీస్ స్టేషనులో జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ ఏపీ ఇన్చార్జ్ ఎం రవీంద్ర మాత్రమే చర్చి స్తలము విషయంలో మమ్ములను ఇబ్బంది పెడుతున్నాడని తమని బెదిరిస్తున్నాడని రవీంద్ర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అనేక అబద్దపు కల్పనలు చేసి పిర్యాదు చేయడంతో ఈ విషయమై పోలీసువారు వివరణ అడుగగా జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ ఏపీ ఇన్చార్జ్ ఎం రవీంద్ర 2వ పట్టణ పోలీస్ స్టేషనులో C.I.కి జరిగిన విషయాలను వివరించడం జరిగినది. శ్రీకాళహస్తి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషయన్ పాస్టర్స్ క్రీస్తు నేర్పిన బోదనలు మరచి ఇంకా ఎన్ని తప్పుకేసులు బనాయిస్తూ, అసత్య ప్రచారాలు చేస్తారో వేచి చూడాలి.