ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీసమావేశం నిర్వహించిన తాసిల్దారు,హనుమంతు

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల కేంద్రంలోనీ తహసిల్దార్ కార్యాలయ కార్యాలయ ఆవరణమునందు శనివారం మండల ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జస్టీస్ పున్నయ్య కమీషన్ సిఫార్సుల మేరకు అంటరానితనం నిర్మూలన, దళిత గ్రామాల్లో ఎస్సీ,ఎస్టీలు ఎదురు కుంటున్నఅమానుష ఘటనలకు తావు లేకుండా వారికి, విద్యవ్యవస్థలో అధిక ప్రాధాన్యతకల్పించే దిశగా అవగాహన, మరియు శుభ్రత, తాగునీటి సౌకర్యాలు, వీధులు,వీధిలైట్లు, మట్టి రోడ్లకు సిసి రోడ్లు, స్మశానం వాటికలు, వివక్ష కు కారణమైన, సంప్రదాయాలు, విడిపించి, అంటరానితనం బంధకాల నుండి, బానిస బ్రతుకులకు గురికాకుండా, గ్రామములో పెత్తందారీ తనం, ఆగ్రహ సన్నివేశాలకు లోను కాకుండా, ప్రజలకు పరిరక్షణ కల్పించే దిశగా సంబంధిత అధికారులు స్పందించి విజిలెన్స్ మరియు మానిటరీ కమిటీ మీటింగ్లు, ప్రతి నెల నిర్వహించాల్సి ఉండగా గత సంవత్సర కాలముగా మండలంలో ఎస్సీ ఎస్టీ మార్నిటింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించలేదని మండల ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.స్పందించిన తహసిల్దార్ ఇక మీదట ప్రతినెల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశం తప్పకుండా నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు మండలంలోని అన్ని సంఘాల ఎస్సీ,ఎస్టి దళిత నాయకులు పాల్గొన్నారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *