గోదావరి జిల్లా, కొత్తపేట మండలం (గరుడ న్యూస్): తణుకు. వరప్రసాద్: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన తిరంగా యాత్ర ర్యాలీలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తో కలిసి పాల్గొన్నారు.జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,కె వి సత్యనారాయణ రెడ్డి,ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొన్న ఈ కార్యక్రమం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నుండి కళా వెంకట్రావు విగ్రహం వరకూ నిర్వహించిన ఈ ర్యాలీలో భారత సైనికులకు జై అంటూ నినాదాలు హోరెత్తింది.అలాగే స్థానిక మాజీ సైనికులను ఎమ్మెల్యే సత్యానందరావు దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.